కోమటిరెడ్డి, సంపత్‌కు మరో షాక్‌ | Komatireddy And Sampath Are Now Ex MLAs | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి, సంపత్‌కు మరో షాక్‌

Mar 16 2018 8:54 PM | Updated on Aug 11 2018 4:59 PM

Komatireddy And Sampath Are Now Ex MLAs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్పీకర్‌పై దాడి చేశారనే కారణంతో అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వీరిద్దరికీ ఎటువంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. శాసనసభ సభ్యత్వం కోల్పోయినందువల్ల ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాజీ అవుతారని కావున​ వారికి శాసనసభ్యులకు లభించే సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. వీరిద్దరికీ ఎమ్మెల్యే గదులు కేటాయించాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) స్పష్టం చేసింది. కాగా, టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement