సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు విద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా అదుపు కాకూడదు, విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ సమస్య మరింత పెద్దది కావాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. అందు కోసమే హైదరాబాద్లో కూర్చుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, టైంపాస్కు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ మంచి పేరు తెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వారు ఇంకా ఏమన్నారంటే...
► కరోనా వల్ల లక్షల మంది చనిపోతే తనకు బాగా పని పెరుగుతుందనే దురాలోచనతో చంద్రబాబు ఉన్నట్లున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎవరికీ మంచి చేయని వ్యక్తి ఇపుడు మాత్రం ఉద్యోగులు, పెన్షనర్ల శ్రేయస్సు కోసమంటూ టైంపాస్ లేఖలు రాస్తున్నారు.
► విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో సీఎం జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే చంద్రబాబు మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకూడదు, ఇంకా సమస్యలు సృష్టించాలి, విద్వేషాలు రగిల్చాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు.
► పది నిమిషాల వీడియో ఫిల్ము, పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మందిని గోదావరి పుష్కరాలప్పుడు తొక్కి చంపావు. అపుడు నువ్వు ఏంచేశావో మరిచావా? అదే విశాఖలో జగన్ సానుభూతితో సమస్యను పరిష్కరిస్తే దుర్మార్గంగా మాట్లాడతావా?
► ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను, రెండోది ఉంటే తొలగింపేనని ఈనాడులో ప్రధానంగా వార్త రాశారు. ఎందుకింత దుర్మార్గంగా వార్తలు రాస్తారు. పత్రికా విలువలంటే ఇవేనా? ఈ జీవో ఏమైనా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చారా? పత్రికాధిపతులే చిలకజోస్యం, కొంగజపం వంటి చర్చలు పెట్టి బురదచల్లే కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా విలువలు ఏముంటాయి?
► వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఖజానాలో రూ 100 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆ పత్రికలే రాశాయి. అయినా ఇచ్చిన మాట తప్పకుండా ఆరు నెలల్లో అన్ని హామీలను జగన్ అమలు చేసిన తీరు మీకు కనిపించదా?
► ఏపీ మాదిరిగా అన్ని రాష్ట్రాలూ వ్యవహరిస్తే కరోనాను అదుపు చేయవచ్చని కేంద్ర బృందం ప్రతినిధి మధుమితా దూబే ప్రశంసించారు. అయినా చంద్రబాబు బృందం విమర్శలు చేస్తోంది.
విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన
Published Wed, May 13 2020 4:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement