రథయాత్రలో అపశృతి.. యడ్యూరప్పపై రాళ్లవర్షం..! | cadre thorw stones at B S Yeddyurappa | Sakshi
Sakshi News home page

రథయాత్రలో అపశృతి.. యడ్యూరప్పపై రాళ్లవర్షం..!

Nov 4 2017 4:11 PM | Updated on Nov 4 2017 4:11 PM

cadre thorw stones at B S Yeddyurappa - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. రథయాత్ర చేపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ సీఎం యడ్యూరప్ప వాహనంపై బీజేపీ అసమ్మతి కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చౌదరి నాగేశ్‌ మద్దతుదారులు యడ్యూరప్ప వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడి నుంచి యడ్యూరప్ప తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రథయాత్రను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement