రాజస్ధాన్‌ కాషాయమయం.. | Bjp Set To Cleansweep In Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్ధాన్‌ కాషాయమయం..

May 23 2019 1:32 PM | Updated on May 23 2019 1:33 PM

Bjp Set To Cleansweep In Rajasthan - Sakshi

రాజస్ధాన్‌లో​ బీజేపీ ప్రభంజనం

జైపూర్‌ : ఉత్తరాదిన కమలం ప్రభంజనంతో రాజస్ధాన్‌లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. మొత్తం 25 లోక్‌సభ స్ధానాలకు గాను 23 స్ధానాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ ఒకే ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు మరో స్ధానంలో ఆధిక్యంలో ఉన్నారు. రాజస్ధాన్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందినా సార్వత్రిక సమరంలో బీజేపీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంది.

ఇక హిందీ రాష్ట్రాల్లో బలీయ శక్తిగా బీజేపీ మరోమారు తన సత్తా చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. కాషాయ ప్రభంజనంతో పలు రాష్ట్రాల్లో విపక్షాలు గల్లంతయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement