హైదరాబాద్‌కు రవీందర్‌ మృతదేహం | NRI Dead Body Reached To Home | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు రవీందర్‌ మృతదేహం

Aug 18 2018 2:13 PM | Updated on Jul 6 2019 12:42 PM

NRI Dead Body Reached To Home - Sakshi

మలేషియాలో మృతిచెందిన  రవీందర్‌ మృతదేహం 

శాయంపేట(భూపాలపల్లి) : పొట్టకూటి కోసం మలేషియాకు వెళ్లి మృత్యువాత పడిన గట్టు రవీందర్‌(42) మృతదేహం స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, మలేషియాలోని తెలుగు ఎన్నారైల సంఘం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ప్రత్యేక చొరవతో శుక్రవారం రాత్రి 11.30కు హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శాయంపేటకు చెందిన గట్టు రవీందర్‌(42) అక్కడ ఐస్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకై ఊపిరాడక ఈ నెల 13 ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే.

గీతకార్మికుడైన రవీందర్‌ కుటుంబ పోషణ నిమిత్తం 2013 సెప్టెంబర్‌లో మలేషియాకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. 5 రోజులుగా రవీందర్‌ మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్పీకర్‌ మధుసూదనాచారి సాయంతో చిట్టిబాబు ఐస్‌ కంపెనీ యజమానులతో మాట్లాడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున మృతదేహం శాయంపేటకు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement