పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా | US outlaws Jamat-ud-daawa | Sakshi
Sakshi News home page

పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా

Jun 26 2014 12:37 PM | Updated on Apr 4 2019 3:25 PM

పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా - Sakshi

పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించిన అమెరికా

ఈ నిషేధం భారతదేశానికి ఒక ముఖ్యమైన దౌత్య విజయంగా భావించవచ్చు.

అమెరికా ప్రభుత్వం పాక్ ఉగ్రవాద సంస్థ జమాతుద్దావాను నిషేధించింది. జమాతుద్దావా లష్కరే తోయబా కి మాతృసంస్థ. ముంబాయి లో 26/11 దాడులకు లష్కర్ సంస్థే కారణం. 
 
ఈ నిషేధం లష్కర్ తో ముడిపడి ఉన్న జమాతుద్దవా సహా అల్ అన్ ఫల్, తహరీకె హుర్మతె రసూల్, తహరీకె తహఫూజ్ కిబ్లా అవ్వల్ వంటి సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఈ నిషేధం వల్ల ఈ సంస్థకు వచ్చే నిధులు ఆగిపోతాయి. దీని కార్యకర్తలపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇటీవలే అఫ్గనిస్తాన్ లోని హెరాత్ లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి కూడా లష్కర్ కారణమని అమెరికా ప్రకటించింది. 
 
ఈ నిషేధం భారతదేశానికి ఒక ముఖ్యమైన దౌత్య విజయంగా భావించవచ్చు. భారత్ లష్కర్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడమే కాక, ఆ సంస్థ అధినేత హాఫెజ్ సయీద్ ను భారత దేశానికి 26 మంది ప్రధాన శత్రువుల్లో ఒకరిగా ప్రకటించింది. హాఫెజ్ ను తమకు ఇవ్వమని భారత్ పాకిస్తాన్ ను ఎప్పటి నుంచో కోరుతోంది. జమాతుద్దావాను నిషేధించాలని ఎప్పట్నుంచో భారత్ ఒత్తిడి తెస్తోంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement