పంజాబ్‌లో బాలికపై సామూహిక అత్యాచారం | Three booked for raping Class-9 student in Moga | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో బాలికపై సామూహిక అత్యాచారం

Mar 25 2014 3:20 AM | Updated on Sep 2 2017 5:07 AM

పంజాబ్‌లోని మొగా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మొగా: పంజాబ్‌లోని మొగా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మొగా జిల్లాలోని బధ్నికలన్ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 20 ఏళ్ల లోపున్న సుఖ్‌జీవన్ సింగ్, జగ్సీర్ సింగ్ సహా మరో వ్యక్తి కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఓ నిర్జనప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement