డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి | stampede outside state bank branch, one dies in uttar pradesh | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి

Nov 21 2016 7:32 PM | Updated on Sep 27 2018 9:08 PM

డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి - Sakshi

డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్‌లో డబ్బుల కోసం తొక్కిసలాట జరిగి అందులో ఒక వ్యక్తి మరణించాడు.

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత ఇంతవరకు క్యూలో నిలబడి గుండెపోటుతో మరణించినవారి విషయాలు తెలిశాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో డబ్బుల కోసం తొక్కిసలాట జరిగి అందులో ఒక వ్యక్తి మరణించాడు. దేవరియా అనే ప్రాంతంలో గల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద పాత నోట్లు మార్చుకోడానికి, కొత్త నోట్లు డ్రా చేసుకోడానికి భారీగా క్యూ ఏర్పడింది. 
 
సాయంత్రం బ్యాంకు మూసేసే సమయం ఆసన్నం అవుతున్నా క్యూ లైను ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అందులో ఒక వ్యక్తి మరణించారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ ఘటనలో ఎంతమంది గాయపడిందీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement