కేబుల్‌కార్‌ కూలి ఏడుగురి దుర్మరణం | Seven members dies while fall down cable car | Sakshi
Sakshi News home page

కేబుల్‌కార్‌ కూలి ఏడుగురి దుర్మరణం

Jun 26 2017 2:15 AM | Updated on Sep 5 2017 2:27 PM

బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్‌లో ఓ కేబుల్‌కార్‌ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు.

శ్రీనగర్‌: బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్‌లో ఓ కేబుల్‌కార్‌ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు ముగ్గురు గైడ్లు ఉన్నారు. బలమైన గాలులకు ఓ చెట్టు మీద పడడంతో రోప్‌వే తెగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలి పారు.

మృతుల్ని ఢిల్లీకి చెందిన జయంత్‌ అంద్రస్కర్, ఆయన భార్య మనీశా అం ద్రస్కర్, కుమార్తెలు అన్ఘా, జహ్నవిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముక్తార్‌ అహ్మద్, జహంగీర్‌ అహ్మద్, ఫరూక్‌ అహ్మద్‌ అనే ముగ్గురు స్థానిక టూరిస్టు గైడ్లు దుర్మరణం చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని అధికారులు శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement