బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్లో ఓ కేబుల్కార్ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు.
శ్రీనగర్: బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్లో ఓ కేబుల్కార్ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు ముగ్గురు గైడ్లు ఉన్నారు. బలమైన గాలులకు ఓ చెట్టు మీద పడడంతో రోప్వే తెగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలి పారు.
మృతుల్ని ఢిల్లీకి చెందిన జయంత్ అంద్రస్కర్, ఆయన భార్య మనీశా అం ద్రస్కర్, కుమార్తెలు అన్ఘా, జహ్నవిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముక్తార్ అహ్మద్, జహంగీర్ అహ్మద్, ఫరూక్ అహ్మద్ అనే ముగ్గురు స్థానిక టూరిస్టు గైడ్లు దుర్మరణం చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని అధికారులు శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు.