మళ్లీ పెళ్లి చేసుకున్నా.. వితంతు పింఛన్! | Pension, widow married again ..! | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకున్నా.. వితంతు పింఛన్!

Feb 10 2015 6:44 AM | Updated on Sep 2 2017 9:02 PM

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన తర్వాత వారి భార్యలు మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా ఇకపై వితంతు పింఛన్ అందుకోవచ్చు.

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన తర్వాత వారి భార్యలు మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా ఇకపై వితంతు పింఛన్ అందుకోవచ్చు. ఈ మేరకు చట్టాన్ని సవరించనున్నట్లు సోమవారం మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్‌తివర్ వెల్లడించారు. మహారాష్ట్ర పౌర సేవలు(పెన్షన్) చట్టం-1982 ప్రకారం.. మరణించిన ఉద్యోగి భార్య మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకూ ఆమెకు వితంతు పింఛన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అయితే, ఈ చట్టం సరైంది కాదని, అందువల్ల దానిని తాము సవరించామని మంత్రి తెలిపారు. దీనికి గవర్నరు ఆమోదం లభించగానే, తగిన మార్పులు చేసి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement