జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ పదవీ విరమణ | NGT chairperson Justice Swatanter Kumar retires | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ పదవీ విరమణ

Dec 20 2017 2:35 AM | Updated on Dec 20 2017 2:35 AM

NGT chairperson Justice Swatanter Kumar retires - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్‌ కుమార్‌ 2012 డిసెంబరు 20న ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్‌ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్‌ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్‌నాథ్‌ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ ఆదేశించారు.  

Advertisement
 
Advertisement
Advertisement