
మోదీ ఈజ్ బ్యాక్
ఆరు రోజుల్లో మూడు దేశాల్లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ ఇండియా విమానం ద్వారా మంగళవారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: ఆరు రోజుల్లో మూడు దేశాల్లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ ఇండియా విమానం ద్వారా మంగళవారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. మే 14న ప్రారంభమైన విదేశీ పర్యటనల్లో భాగంగా చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలో పర్యటించిన ఆయనకు ఆయా దేశాల్లో ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనల సందర్భంగా చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలతో కీలక చర్చలు జరిపి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.