మిజోరంలో హైడ్రో ప్రాజెక్టు ప్రారంభించిన మోదీ

modi inaugurate 60 megawatt power project in mizoram - Sakshi

న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మిజోరంలో పర్యటిస్తున్నారు. తొలిసారి మిజోరంలో పర్యటిస్తున్న ఆయన  అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు. ఐజ్వాల్లో హైడ్రో ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఏ సమస్య వచ్చినా ఢిల్లీ వరకు రానక్కర్లేదని...కేంద్రప్రభుత్వ అధికారులే మీ వద్దకు వస్తారని  అన్నారు. అలాగే ప్రజలకు ముందుగానే క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో  ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలతో ప్రధాని సమావేశం అవుతారు. అలాగే మేఘాలయలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top