వైరలవుతోన్న ట్వీట్‌.. సంతోషంలో నైనా | Major Akshay Girish Daughter Receive Wishes From Strangers | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న ట్వీట్‌.. సంతోషంలో నైనా

Oct 29 2018 5:48 PM | Updated on Oct 29 2018 5:54 PM

Major Akshay Girish Daughter Receive Wishes From Strangers - Sakshi

మరణించిన మేజర్‌ అక్షయ్‌ గిరీష్‌ కుమార్తె చిన్నారి నైనా

మనందరి కోసం అక్షయ్‌ ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు నైనా ఐదో వసంతంలోకి అడుగుపెడుతోంది

న్యూఢిల్లీ : దేశానికి తిండి పెట్టే రైతులు గురించి.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్‌ల గురించి నాయకులే కాదు జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. సైనికుల త్యాగాలు.. రైతుల కడగండ్లు మన కళ్లకు కనపడవు. మీడియా కూడా తళుకుబెళుకలకే ప్రాధన్యతిస్తుంది.. కానీ త్యాగాలకు కాదు. కానీ నిజమైన దేశభక్తి కలిగిన కొందరు మాత్రం మనందరికి భిన్నంగా ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే హుతాన్షు వర్మ. నిన్న (ఆదివారం) హుతాన్షు చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవ్వడమే కాకా పలువురు నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది.

ఈ ట్వీట్‌లో హుతాన్షు ‘చిన్నారి నైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి నాతో కలవండి. నైనా మేజర్‌ అక్షయ్‌ గిరిష్‌ కుమార్తె. రెండేళ్ల క్రితం నగ్రోటాలో జరిగిన దాడుల్లో అక్షయ్‌ మరణించారు. మనందరి కోసం అక్షయ్‌ ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు నైనా ఐదో వసంతంలోకి అడుగుపెడుతోంది.. కానీ ఈ సమయంలో తన తండ్రి ఇక్కడ లేకపోవడం విచారకరం. కానీ ఈ చిన్నారికి మనందరం తోడుగా ఉన్నామని హామీ ఇద్దాం రండి’అంటూ ట్వీట్‌ చేశారు. హుతాన్షు చేసిన ఈ ట్వీట్‌ని కొన్ని గంటల్లోనే దాదాపు 10 వేల మందికి పైగా లైక్‌ చేయగా.. 4 వేల మంది రిట్వీట్‌ చేశారు.

                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement