మా బడిలో చేరితే బహుమానం | If you join our school we give gift | Sakshi
Sakshi News home page

మా బడిలో చేరితే బహుమానం

Jun 8 2016 2:22 AM | Updated on Sep 4 2017 1:55 AM

ప్రైవేటు స్కూళ్ల ఆధిపత్యం నేపథ్యంలో.. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు కొత్త మార్గం ఎన్నుకున్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సురేశ్ అనే ఓ ప్రధానోపాధ్యాయుడు

కొత్తగా చేరిన విద్యార్థులకు రూ.వెయ్యి ఇస్తున్న హెచ్‌ఎం


కేకే.నగర్(చెన్నై): ప్రైవేటు స్కూళ్ల ఆధిపత్యం నేపథ్యంలో.. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు కొత్త మార్గం ఎన్నుకున్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సురేశ్ అనే ఓ ప్రధానోపాధ్యాయుడు. తన స్కూల్‌లో చేరే ప్రతి విద్యార్థికి రూ.వెయ్యి ఇస్తానని వేసవి సెలవుల్లో ఆయన ప్రకటించారు. అన ంతరం, ఈ నెల 1న పాఠశాల పునః ప్రారంభమవ్వడంతో కొత్తగా చేరిన 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున సొంత డబ్బులు చెల్లించి మాట నిలబెట్టుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement