'అంతా జీపీఎస్మయం' | Govt orders installation of GPS in all cabs plying in Delhi | Sakshi
Sakshi News home page

'అంతా జీపీఎస్మయం'

Mar 15 2015 11:50 AM | Updated on Sep 2 2017 10:54 PM

'అంతా జీపీఎస్మయం'

'అంతా జీపీఎస్మయం'

న్యూఢిల్లీ: ఢిల్లీ అద్దె వాహనాలన్నీ జీపీఎస్మయం కానున్నాయి. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకునే దిశగా కొత్తగా కొలువు దీరిన సర్కారు ట్యాక్సీల్లో ఖచ్చితంగా జీపీఎస్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అద్దె వాహనాలన్నీ జీపీఎస్మయం కానున్నాయి. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకునే దిశగా కొత్తగా కొలువు దీరిన సర్కారు ట్యాక్సీల్లో ఖచ్చితంగా జీపీఎస్ ఉండాలని, అలా జీపీఎస్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్కిఫికెట్లు కూడా ఇవ్వొద్దని రహదారుల పన్నుశాఖ (ఆర్టీవో) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 

ప్రభుత్వశాఖకు చెందిన సీనియర్ అధికారుల వివరాల ప్రకారం రేడియో ట్యాక్సీలు, బ్లాక్, ఎల్లో ట్యాక్సీలతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించే అద్దె వాహనాల్లో ఖచ్చితంగా జీపీఆర్ను కలిగిఉండాలని, వాటి వివరాలు పోలీసుశాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ట్యాక్సీలో ఓ 25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరగడంతోపాటు.. ఇటీవల కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకురావాలని సర్కారు భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement