
రోగులకు ‘సంగీత చికిత్స’
మెళ్లో స్టెతస్కోపుతో వైద్యం చేయాల్సిన డాక్టర్లంతా తమ గానమాధుర్యంతో రోగులకు చికిత్స చేశారు. ఈ సంఘటన బుధవారం కొచ్చిలోని జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
కొచ్చి: మెళ్లో స్టెతస్కోపుతో వైద్యం చేయాల్సిన డాక్టర్లంతా తమ గానమాధుర్యంతో రోగులకు చికిత్స చేశారు. ఈ సంఘటన బుధవారం కొచ్చిలోని జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని డాక్టర్ల బృందమంతా కలసి పాతపాటలు పాడుతూ రోగులకు వైద్యం చేశారు. కళలు, సంగీతం నాణ్యమైన జీవనాన్ని పెంపొందిస్తుందని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ సంగీత చికిత్సను ప్రారంభించారు. కేరళకు చెందిన ‘కొచ్చి బియోన్నల్ ఫౌండేషన్ (కేబీఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఈ ప్రాజెక్టు చేపట్టింది.