నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సహకార బ్యాంకులపై ఆధారపడి గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


రైతుల నగదు అవసరాలు తీర్చేందుకు సహకార బ్యాంకులకు సాయం చేయాలని బ్యాంకులకు అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ సూచించారు. ఈ విషయమై ఆర్‌బీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించామని పేర్కొన్నారు. చేనేత, చేతివృత్తుల సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top