బ్యాంకుల ముందు టెంట్లేశారు | Arrangements being done by banks in Bhopal for the convenience of customers | Sakshi
Sakshi News home page

బ్యాంకుల ముందు టెంట్లేశారు

Nov 10 2016 9:54 AM | Updated on Sep 4 2017 7:44 PM

బ్యాంకుల ముందు టెంట్లేశారు

బ్యాంకుల ముందు టెంట్లేశారు

బ్యాంకులు కొత్త నోట్లను ఇవ్వడం ప్రారంభించాయి

భోపాల్: బ్యాంకులు కాలం తీరిపోయిన 500, 1000 రూపాలయల నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం ప్రారంభించాయి. ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయంతో రెండు రోజులుగా 500, 1000 రూపాయల నోట్లు తప్ప వేరే కరెన్సీ నోట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు ముందుగా బ్యాంకులకు పరిగెత్తుతున్నారు. బ్యాంకులు కూడా రద్దీని ఊహించి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి.

బ్యాంకులు అదనపు కౌంటర్ల ఏర్పాటుతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొన్ని బ్యాంకుల ముందు ఇలా టెంటు వేసి కనిపించింది. నోట్లను మార్చుకోవడానికి ప్రజలు భారీ ఎత్తున వస్తారని, వారికి అసౌకర్యం కలుగకుండా ఈ ఏర్పాట్లు చేశామని వారు చేబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement