కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట, 9మంది మృతి | 9 killed,several injured in stampede at kamtanath temple | Sakshi
Sakshi News home page

కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట, 9మంది మృతి

Aug 25 2014 8:09 AM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాత్నా జిల్లా చిత్రకూట్లోని కంఠనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పదిమంది భక్తులు దుర్మరణం చెందారు.

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌ చిత్రకూట్ ప్రాంతంలోని కంఠానాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలైయాయి. సాత్నా జిల్లాలోని కంఠనాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించాడని అంటారు.

అమావాస్య కావడంతో ఒక్కసారిగా  భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాధమిక సమాచారం.  మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జరిగిన ఘటనపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. సాత్నా జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిల్లో చికిత్సనందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement