‘నువ్వు తోపురా’ టీజర్‌ రిలీజ్‌

Sudhakar Komakula Nuvvu Thopu Raa Teaser Released - Sakshi

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’లో నాగరాజు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రలో సుధాకర్‌ తెలంగాణ యాసలో మాట్లాడి నాచురల్‌గా యాక్ట్‌ చేశాడు. సుధాకర్‌ ప్రస్తుతం హీరోగా వస్తోన్న చిత్రం ‘నువ్వు తోపురా’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

‘ప్రతీ మగాడికి దురదుంటది..కానీ ఒక్క అమ్మాయిని చూసిన తరువాత ఆగిపోతుంది’, ‘మేకలు ఎక్కువగా ఉంటే.. శాకాహారికి కూడా మాంసం తినాలనిపిస్తది. ఈడ బతకాలంటే తోడేళ్ల లెక్కుండాలె’ వంటి డైలాగ్‌లు వైరల్‌ అవుతున్నాయి. యునైటెడ్‌ ఫిలిమ్స్‌పై శ్రీకాంత్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హరినాథ్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్యా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top