హీరోలు... విలన్లు ఉండరు! | no Heroes no villains in this movie | Sakshi
Sakshi News home page

హీరోలు... విలన్లు ఉండరు!

May 6 2017 12:24 AM | Updated on Aug 29 2018 3:53 PM

హీరోలు...  విలన్లు ఉండరు! - Sakshi

హీరోలు... విలన్లు ఉండరు!

నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ఈ ఇద్దరితో పాటు శ్రియ, సత్యదేవ్‌ కలసి నటించనున్న మల్టీస్టారర్‌ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్‌ పతాకంపై ఎంవీకే సమర్పణలో అప్పారావు బెల్లన నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్‌. ఇంద్రసేన దర్శకునిగా పరిచయం కానున్నారు. మే రెండో వారంలో చిత్రీకరణ ఆరంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన నాకు మంచి మిత్రుడు. కథ చెప్పగానే మైండ్‌ బ్లో అయింది. కథ విన్న వెంటనే నారా రోహిత్, శ్రీవిష్ణు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. శ్రియాగారు, సత్యదేవ్‌ స్టోరీ విని ఎగై్జట్‌ అయ్యారు. ఈ నలుగురి పాత్రలను ఇంద్రసేన చక్కగా తీర్చిదిద్దాడు’’ అన్నారు. ‘‘సమాజంలో జరిగే విభిన్న కోణాలను టచ్‌ చేసే మల్టీస్టారర్‌ స్టోరీ ఇది. పాత్రలు తప్ప సినిమాలో హీరోలు.. విలన్లు ఉండరు ’’ అన్నారు ఆర్‌. ఇంద్రసేన. ఈ చిత్రానికి సంగీతం: సతీష్‌ రఘునాథన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement