మనం మారాలి..! | Jendapai kapiraju release on 21 March | Sakshi
Sakshi News home page

మనం మారాలి..!

Mar 16 2015 11:17 PM | Updated on Sep 2 2017 10:56 PM

మనం మారాలి..!

మనం మారాలి..!

ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’.

ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నాని కెరీర్‌లో చాలా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించాం. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. సామాజిక ఇతివృత్తాన్ని చాలా వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారు’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, రాగిణి ద్వివేది, ఆహుతి ప్రసాద్, ప్రత్యేక పాత్రలో శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సమర్పణ: పి. రామ్మోహనరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement