గోపిచంద్‌తో స్వీటీ

Anushka Gopichand Team Up For Third Time - Sakshi

టాలీవుడ్‌ యాక్షన్‌ హీరో గోపిచంద్‌, అందాల భామ అనుష్క మరోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారట. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన లక్ష్యం, శౌర్యం సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతోమరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్ అయితే ఇద్దరి కెరీర్‌లకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు.

జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కిన నా నువ్వే ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ముప్పవరపు కిరణ్‌, విజయ్‌ కుమార్‌లే గోపిచంద్‌ హీరోగా తెరకెక్కబోయే సినిమాను కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం చర‍్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top