ఎసీపీగా పోసాని | ACP Role in Posani Krishna Murali | Sakshi
Sakshi News home page

ఎసీపీగా పోసాని

Mar 31 2014 11:29 PM | Updated on Apr 3 2019 8:28 PM

ఎసీపీగా పోసాని - Sakshi

ఎసీపీగా పోసాని

అరుణ్, ఆర్య, ప్రజ్ఞ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న

అరుణ్, ఆర్య, ప్రజ్ఞ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ వెన్నెలకంటి దర్శకుడు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సి.కల్యాణ్ కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కిషోర్‌కుమార్(డాలీ) గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సుభాష్‌ఘయ్ వద్ద దర్శకత్వ శాఖలో చేశాను. రాజకీయం, కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. 40 రోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో ఏసీపీగా నటిస్తున్నానని పోసాని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: జి.వెంకటేశ్వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికాంత్ కౌశిక్.
 

Advertisement
 
Advertisement
Advertisement