మలేషియా: ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై మలేషియా పోలీసులు హత్యాభియోగాలు మోపనున్నారు. విచారణ పూర్తి చేసి వారు దోషులుగా తేలితే వారికి మరణ శిక్ష అమలు చేయనున్నారు. మలేషియా అటార్నీ జనరల్ మహ్మద్ అపాంది అలీ ఈ మేరకు బుధవారం వివరాలు తెలియజేశారు.
నామ్ హత్యకు సంబంధించి తదుపరి జరగనున్న పరిణామాలను చెప్పారు. ఇండోనేషియాకు చెందిన సితి ఐసియా, వియత్నాంకు చెందిన డోవాన్ థి హువాంగ్ అనే ఇద్దరు మహిళలపై హత్యాభియోగాలు నమోదుకానున్నాయని, వారు దోషులుగా తేలితే మరణ శిక్షే ఉంటుందని తెలిపారు. అదొక సరదా కార్యక్రమం అని భావించి, అందులో నటించేందుకని అనుకొని తాను 90 డాలర్లు తీసుకొని అవతలి వ్యక్తి చేసినట్లు సితీ ఐసియా చెప్తుండగా మలేషియా పోలీసులు మాత్రం వారిద్దరు ఏం చేస్తున్నారనే విషయం వారికి ముందే తెలుసని చెప్పారు.
మరో ఇద్దరిని కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా వారిలో ఒకరు ఇప్పటికే బెయిల్పై బయట ఉన్నారు. మరో ఉత్తర కొరియా వ్యక్తిని మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ ఉత్తర కొరియాకు సంబంధించిన వ్యక్తిపై ఆరోపణలు నమోదు చేయాల్సి వస్తే అతడి విషయంలో కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. మరో ఏడుగురు ఉత్తర కొరియాకు చెందినవారి కోసం మలేషియా పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో నలుగురు ఇప్పటికే తమ దేశం పారిపోయారట.
కిమ్ సోదరుడిని చంపిన మహిళలకు మరణ శిక్ష!
Published Tue, Feb 28 2017 3:29 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement