పాక్‌ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి | Suicide Bomber Kills at Least 11 at Pakistani Army Base | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి

Feb 5 2018 5:24 AM | Updated on Nov 6 2018 7:53 PM

Suicide Bomber Kills at Least 11 at Pakistani Army Base - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాత్‌ జిల్లాలోని ఆర్మీ యూనిట్‌ లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ మేజర్‌ సహా 11 మంది పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. తాలిబాన్లకు గట్టి పట్టున్న స్వాత్‌ లోయలోని ఆర్మీ బేస్‌ సమీపంలో శనివారం ఈ దాడి జరిగినట్లు పాక్‌ ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తొలుత నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాది.. ఆర్మీ బేస్‌ బయట వాలీబాల్‌ ఆడుతున్న సైనికులు లక్ష్యంగా తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement