యెమెన్లోని ఆడెన్ నగరంలో సోమవారం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్లలో 45 మంది మరణించారు.
45 మంది బలి
సనా: యెమెన్లోని ఆడెన్ నగరంలో సోమవారం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్లలో 45 మంది మరణించారు. ఆర్మీలో చేరడానికి వచ్చిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ బయట పేలిన కారు బాంబులో 20 మంది, రిక్రూట్మెంట్కు వచ్చిన వారు వేచి ఉండే చోట జరిగిన మరో పేలుడులో 25 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.