తాలిబన్లపై విరుచుకుపడిన పాక్ సైన్యం | New screen army of the Taliban in Pakistan | Sakshi
Sakshi News home page

తాలిబన్లపై విరుచుకుపడిన పాక్ సైన్యం

Jun 17 2014 1:09 AM | Updated on Sep 2 2017 8:54 AM

తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో రెండు రోజులుగా జరిపిన దాడుల్లో 177 మంది మిలిటెంట్లు మరణించారు.

ఇస్లామాబాద్: తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో రెండు రోజులుగా జరిపిన దాడుల్లో 177 మంది మిలిటెంట్లు మరణించారు. వీరిలో చాలా మంది విదేశీయులూ ఉన్నారు. అయితే ఓ బాంబు పేలుడులో ఆరుగురు సైనికులు కూడా చనిపోయారు.

ఇక్కడి షవాల్ ప్రాంతంలోని ఆరు ఉగ్రవాద స్థావరాలపై పాక్  మిలటరీ జెట్లు సోమవారం బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 27 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు సైనికాధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మరో పది మందిని హతమార్చినట్లు చెప్పారు. ఇక దేగాన్ బోయా ప్రాంతంలో ఆదివారం జరిపిన దాడుల్లో 140 మంది టైస్టులు హతమైనట్లు పాక్ సైన్యం పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement