దుండగుల కాల్పుల్లో భారతసంతతి జంట మృతి | Indian based couple shot dead in Philippines | Sakshi
Sakshi News home page

దుండగుల కాల్పుల్లో భారతసంతతి జంట మృతి

Nov 24 2016 4:24 PM | Updated on Sep 4 2017 9:01 PM

దుండగుల కాల్పుల్లో భారతసంతతి జంట మృతి

దుండగుల కాల్పుల్లో భారతసంతతి జంట మృతి

భారత సంతతికి చెందిన ఓ జంట ఫిలిప్పీన్స్లో హత్యకు గురయ్యారు.

మనీలా: భారత సంతతికి చెందిన ఓ జంట ఫిలిప్పీన్స్లో హత్యకు గురయ్యారు. టుజాన్ ఐలాండ్లోని బైకాల్ రీజియన్లో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భగవంత్ సింగ్ బట్టర్(45), జస్విందర్ కౌర్(36) అనే దంపతులు కమరైన్స్ సుర్ ప్రావిన్స్లోని సిపోకాట్నగరంలోని బార్టోలోమ్లో నివాసముంటున్నారు.

ఈ జంట తమ ఇంటికి వెళుతున్న సమయంలో మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వారి పై కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలైన భగవంత్ సింగ్,  జస్విందర్ కౌర్ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఇద్దరు అనుమానితులు మార్విన్ మగ్డాంగ్(40), రొడాల్ఫో గుమాటే(53)లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement