ఇండోనేషియాలో భారీ భూకంపం : 54 మంది మృతి | At least 54 people were killed in an earthquake in Indonesia’s Aceh province | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భారీ భూకంపం : 54 మంది మృతి

Dec 7 2016 1:14 PM | Updated on Sep 4 2017 10:09 PM

ఇండోనేషియాలో భారీ భూకంపం : 54 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం : 54 మంది మృతి

ఇండోనేషియా ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది.

జకర్త: ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో బుధవారం రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ధాటికి భారీ నిర్మాణాలు సైతం నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 54 మంది మృతిచెందగా, వందమందికి పైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర సుమత్రాలోని బందా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

2004లో పశ్చి సుమిత్ర ద్వీపంలోని అచీ ప్రావెన్స్ సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీతో దాదాపు రెండు లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement