అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్సీపీ లేఖ | ysrcp letter to assembly secretary over privilege meeting postpone | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్సీపీ లేఖ

Mar 19 2016 5:26 PM | Updated on May 29 2018 3:48 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా నిమ్స్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సభా హక్కుల కమిటీ భేటీని 15 రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ భేటీకి రోజా హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు.

అసెంబ్లీ హాల్లో శనివారం మధ్యాహ్నం సభా హక్కుల కమిటీ విచారణ జరిగింది. ఈ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకావడం లేదని ఎమ్మెల్యే రోజా కూడా కమిటీకి లేఖ పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement