- అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి
- పేదవాడికి అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు
- మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారు
- ప్రొక్లెయినర్లతో సిమెంట్ రోడ్ల పనులు చేయిస్తున్నారు
- నిధులన్నీ కూలీలకే ఇవ్వాలి
- సీఎం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పేదల ఆకలి తీర్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పేదలకు ఉపయోగపడేలా చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా కూలీలకు వంద శాతం మేలు జరగాల్సి ఉండగా మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లా డుతూ.. ‘‘ఉపాధి హామీ అంటే.. పేదవాడి కడుపు నింపే పథకం. ఈ కూలీల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించింది. నీరు-మీరుతోపాటు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తోంది. సిమెంట్ రోడ్ల పనులను ప్రొక్లెయినర్లతో చేయిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం నిధులు 100 శాతం కూలీలకే చెందేవి. ఇప్పుడు 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ అని, 60 శాతం కూలీలకు అని చెబుతున్నారు.
చట్టం ప్రకారం 60 శాతానికి పైగా నిధులను కూలీలకు చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నిస్తే 100 శాతం కూలీలకే దక్కేవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రొక్లెయినర్లు పెట్టి పనులు చేస్తే కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుంది? గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీలకు 100 శాతం నిధులను నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో జమచేసే వారు. కేంద్రం ఈ పథకంలో మార్పులు చేస్తున్నా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఎన్టీయేలో భాగస్వామి అయిన టీడీపీ కేంద్రంతో మాట్లాడి 100 శాతం నిధులు ఉపాధి హామీ కూలీలకు దక్కేలా చేయొచ్చు కదా! రాష్ట్రంలో 1.70 కోట్ల మంది ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటే 58 లక్షల మందికే పని కల్పిస్తున్నారు. కడుపునిండా అన్నం పెట్టే ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.
దళిత జాతికి తీవ్ర అన్యాయం
ఏ వెనుకబడిన దళితుల కోసమైతే బీఆర్ అంబేడ్కర్ పోరాటం చేశారో ఆ వర్గాన్నే రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంగళవారం అంబేడ్కర్ 125వ జయంతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఏ వర్గం కోసం, ఏ జాతి ఔన్నత్యం కోసం పోరాటం చేశారో ఆ జాతికి ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు క్రిస్టియన్లుగా మారితే వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దళితుల్లోనూ కులాలు, మతాలు ఉంటాయా? అని ప్రశ్నించారు.
ఉపప్రణాళిక నిధులు రాజ్యాంగ హక్కు
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వారికోసమే ఖర్చు చేయాలని, అది దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఈ నిధుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తోందని విమర్శించారు. ‘‘దళితుల నిధుల్లో రూ.2,500 కోట్లు, ఎస్టీల నిధుల్లో రూ.1,300 కోట్లు కోత వేశారు. ఎస్టీ, ఎస్టీల అభివృద్ధి అంటే ఇదేనా?’’ అని జగన్ నిలదీశారు. రెండేళ్లుగా గిరిజన సలహా మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదనిప్రశ్నించారు.
విశ్వసనీయత ఉంటేనే హుందాతనం
ఓ నాయకుడికి వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉన్నపుడే రాజకీయాల్లో హుందాతనం వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఆయన లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ రాజీనామాపై స్పందించాలని కోరగా... ‘‘ఏముంది మేం బాధితులం. ఆయన(చంద్రబాబు) ప్రలోభానికి వారు లొంగిపోయారు’’ అని బదులిచ్చారు. ‘‘రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత రెండూ ఉండాలి, అవి లేనప్పుడు భార్య కూడా గౌరవించదు. ఈ రెండూ ఉన్నాయా లేవా అని చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మా పార్టీని వీడిపోయిన వాళ్లు కూడా వాళ్ల మనస్సాక్షిని ఇదే విషయం ప్రశ్నించుకోవాలి. పార్టీని వీడిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళితే గెలుస్తామన్న ధైర్యం, విశ్వాసం చంద్రబాబుకు లేవు. ఎమ్మెల్యేలను అధికార పక్షం దాదాపు రూ.30 కోట్లతో ప్రలోభాలు పెడుతోంది’’ అని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు కాలం చెల్లిన నేత
గ్రామీణ ఉపాధి పథకం హామీ గురించి చట్టంలో ఏముందో జగన్ తెలియజేశారు. ఒక పనిలో కూలీలకు చెల్లించే వేతనాలు 60 శాతానికి మించి ఎంతైనా పెరగొచ్చని స్పష్టంగా ఉంటే చంద్రబాబుకు మాత్రం అర్థం కాదని అన్నారు. చంద్రబాబు ఔట్డేటెడ్ పొలిటీషియన్ (కాలం చెల్లిన రాజకీయవేత్త) ఆయనకు అర్థం కాదు అని జగన్ అన్నారు.
‘ఉపాధి’ నిధులు పక్కదారి
Published Wed, Mar 30 2016 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement