యాసిన్ భత్కల్ తీహార్‌ జైలుకు తరలింపు | Yasin Bhatkal sent to tihar jail by nia officers | Sakshi
Sakshi News home page

యాసిన్ భత్కల్ తీహార్‌ జైలుకు తరలింపు

Feb 2 2017 10:20 AM | Updated on Oct 17 2018 5:14 PM

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు.

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌ను ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్‌ఐఏ అధికారులు తీహార్‌ జైలుకు పంపించారు.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అజాజ్‌, అక్తల్‌ను ముంబైకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ట్రయల్స్‌ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భత్కల్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. భత్కల్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అధికారులు అతన్ని తీహార్‌ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement