'మంచి సంప్రదాయం కాదు' | Sakshi
Sakshi News home page

'మంచి సంప్రదాయం కాదు'

Published Mon, Aug 31 2015 9:46 AM

'మంచి సంప్రదాయం కాదు' - Sakshi

హైదరాబాద్: శాససభలో విపక్ష వైఎస్సార్ సీపీ సమయం వృధా చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రత్యేక హోదాపై తమ ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని తెలిపారు. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు.

తాము స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నామని తెలిసి కూడా ఈ విధంగా సమయాన్ని వృధా చేయడం సమంజసం కాదన్నారు. సభా సమయం వృధా చేసి సమావేశాల గడువు పెంచాలని కోరతారా అని ప్రశ్నించారు. చర్చకు స్పీకర్ అనుమతించిన తర్వాత మీ డిమాండ్లు అన్ని చెప్పాలని సూచించారు. పదే పదే సభను అడ్డుకోవడం సంప్రదాయం కాదన్నారు.

Advertisement
Advertisement