
ఆస్తికోసం నగ్న చిత్రాలు తీసి..
ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత మరదలిని కత్తితో బెందిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత మరదలిని కత్తితో బెందిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో వెలుగుచూసింది. ఓ యువకుడు తన మరదలి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట రాయక పోతే నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ ఇటీవలి సొంత మరదలి పేరుతో స్థలం కొన్నాడు. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో.. ఒక్కసారిగా భూమికి ధర పెరిగింది.
దీంతో ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరదలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఫొటోలను తీశాడు. అనంతరం ఎవరికైన చెప్పినా.. ఆస్తి తన పేరిట రాయక పోయినా నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి గతంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వివాహం అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.