♦ ముగిసిన దరఖాస్తు గడువు, ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష
♦ జంబ్లింగ్ పద్ధతిలో హాల్టికెట్ నంబర్లు
♦ ఎస్సై కన్నా కానిస్టేబుల్ పోస్టులకే అభ్యర్థుల మొగ్గు
♦ కానిస్టేబుల్ కొలువులకు ఏకంగా 5.36 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సై పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. వివిధ విభాగాలలోని 539 పోస్టులకు ఆన్లైన్ ద్వారా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పురుషులు 1.75 లక్షలు కాగా, మహిళలు 25 వేల మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అభ్యర్థుల వేలిముద్రలు కూడా తీసుకోనున్నారు. అలాగే హాల్టికెట్లను వరుస క్రమంలో కాకుండా జంబ్లింగ్ విధానంలో ఇవ్వనున్నారు.
ఎస్సై పోస్టులకు తగ్గిన ఉత్సాహం
కానిస్టేబుల్ పోస్టులతో పోలిస్తే ఎస్సై పోస్టుల దరఖాస్తు విషయంలో అభ్యర్థులు అంతగా ఉత్సాహం కనబరచలేదు. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఎస్సై పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. కానిస్టేబుల్ పోస్టులకు మహిళా అభ్యర్థులు 82 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఎస్సై పోస్టులకు 25 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 5.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించిన వారు 2.08 లక్షల మంది ఉన్నారు. కానీ ఎస్సై పోస్టుల విషయానికొస్తే 2.01 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్తో పోల్చితే ఎస్సై కొలువు కాస్త ఉన్నత ఉద్యోగమైనప్పటికీ దరఖాస్తులు ఆ స్థాయిలో రాలేదు. ఎస్సై పోస్టులకు దాదాపు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని భావించినా అలా జరగలేదు. అందులోనూ గరిష్ట వయోపరిమితిని మరో ఏడాదిపాటు పెంచడంతో అదనంగా 30 వేల దరఖాస్తులు వచ్చాయి.
ఎస్సై పోస్టులకు 2 లక్షల దరఖాస్తులు
Published Sat, Mar 12 2016 12:29 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement