దిగుమతులపై వాణిజ్య పన్నుల శాఖ ఆరా
పన్నులు చెల్లించని వారిపై కొరడా
తనిఖీలకు అధికారులు సిద్ధం
సిటీబ్యూరో: ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ... గ్రేటర్ హైదరాబాద్లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ‘జీరో’ వ్యాపారంపై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు పన్ను చెల్లించకుండా... గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ గ్రేటర్ పరిధిలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 12 డివిజన్లకు గాను ఏడు గ్రేటర్లోనే విస్తరించి ఉండటంతో అత్యధిక రాబడి సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
ఎలక్ట్రానిక్, స్టీల్, ప్లాస్టిక్ ముడిసరుకులతో పాటు ఫుడ్ గ్రెయిన్స్ తదితర వస్తువులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్తో అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. రాష్ర ్టసరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్, రైళ్లు, విమానాల ద్వారా వచ్చే వస్తువులను అడ్డుకునే ప్రత్యేక విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ వ్యాపారంతోనూ వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గుతోందని భావిస్తున్నారు. ఇటీవల దిగుమతి అవుతున్న వస్తువుల మొత్తం విలువలో ఒక శాతం, 5 శాతం వ్యాట్ ఉన్న వాటికి ఇతర రాష్ట్రాల్లో వేస్తున్న పన్నుల వివరాలు సేకరించి, అవసరమైతే కొన్నిటిని 14.5 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని వాణిజ్య పన్నుల శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తనిఖీలకు సిద్ధం
గ్రేటర్ హైదరాబాద్లో వాణిజ్య శాఖ ఆదాయం తగ్గుముఖం పట్టింది. జీరో దందాతో వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ క్షీణించింది. ఫలితంగా సర్కార్కు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగిస్తునట్లయింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చే మొత్తం రాబడిలో 74 శాతం నగరం నుంచే జమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో అత్యధిక ఆదాయం సమకూరే గ్రేటర్లో జీరో దందాకు అడ్డుకట్ట వేసేందుకు, ఇందులో భాగంగా ముమ్మర తనిఖీలకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇక ‘జీరో’యే!
Published Thu, Dec 25 2014 12:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement