'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకుడు' | T congress leaders pay tributes to ys rajasekhar reddy | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకుడు'

Sep 2 2016 12:46 PM | Updated on Jul 7 2018 2:52 PM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి తెలిపారు.

హైదరాబాద్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. శుక్రవారం గాంధీభవన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్దంతి జరిగింది. ఈ కార్యక్రమానికి టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు మాజీ మంత్రి డీకే అరుణ, బలరాం నాయక్ పాల్గొన్నారు.

అలాగే పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతోపాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లు భట్టివిక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని వైఎస్ఆర్ కలలుగనే వారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement