మహిళ అనుమానాస్పద మృతి | Suspicious death of woman | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

May 27 2016 2:29 PM | Updated on Sep 4 2018 5:21 PM

తిలక్‌నగర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.

తిలక్‌నగర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. తిలక్‌నగర్‌లో నివాసముండే ప్రమీల గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు ఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పడంతో రైలు ఢీకొని మృతి చెందిందా లేక ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందిందా అన్న సందేహాలు నెలకొన్నాయి. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement