- నిర్ణయించాలని కోరిన ప్రైవేటు యాజమాన్యాలు
- తొలిసారి భేటీ అయిన ఫీజుల నియంత్రణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ప్రాంతం, స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా ఫీజులను నిర్ణయించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోరగా, పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే ఫీజుల నిర్ధారణకు చర్యలు చేపట్టాలని తల్లిదండ్రుల కమిటీలు కోరాయి. ఉస్మానియా మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు చైర్మన్గా, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ కన్వీనర్గా ప్రభుత్వం నియమించిన ఫీజుల నియంత్రణ కమిటీ గురువారం పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయంలో మొదటిసారిగా సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘా లు తమ వాదనలను వినిపించాయి. రాత పూర్వకంగా ప్రతిపాదనలను అందజేశాయి. గ్రామీణ, మండల స్థాయిలోని పాఠశాలలను ఒక కేటగిరిగా తీసుకోవాలని, పట్టణ ప్రాంతాలు, జిల్లా హెడ్ క్వార్టర్లోని స్కూళ్లను రెండో కేటగిరిగా, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లను మూడో కేటగిరిగా తీసుకుని ఫీజులను నిర్ణయించాలని యాజమాన్య సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్రెడ్డి, ఎస్ఎన్రెడ్డి కోరారు. అన్ని పాఠశాలలను ఒకేలా చూడవద్దని, ప్రాంతాలను బట్టి కూడా తేడాలు ఉంటాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్.నారాయణ, అరవింద్, వెంకట్ తదితరులు.. వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను నిర్ధారిస్తున్నట్లుగా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేసి ఫీజులను నిర్ణయించాలని కోరారు. పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే ఫీజులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఫీజుల నియంత్రణను త్వరగా తేల్చాలని కోరారు. అయితే ఈ సందర్భంగా ఒక్కో సంఘం నుంచి ఒక్కరే సమావేశంలో పాల్గొనాలని కమిటీ సూచించింది. ఒక్కో సంఘం నుంచి ముగ్గురిని అనుమతించాలని కోరినా కాదనడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వెళ్లిపోయాయి. ప్రభుత్వం వద్దకు వెళ్లి ఒక్కో సంఘం నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులను అనుమతించాలని కోరతామని యాజమాన్యాల ప్రతినిధులు చెప్పారు. దీంతో ఏప్రిల్ 4న మరోసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదలను స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది.
మూడు కేటగిరీల్లో పాఠశాలల ఫీజులు
Published Fri, Mar 31 2017 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement