సాక్షి టీవీ పిటిషన్‌ను పరిష్కరించిన హైకోర్టు | Sakshi TV petition addressed the High Court | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ పిటిషన్‌ను పరిష్కరించిన హైకోర్టు

Jun 28 2016 1:00 AM | Updated on Aug 31 2018 8:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవా లు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ టీవీ ప్రసారాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపేశారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సాక్షి టీవీ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సోమవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. సాక్షి ప్రసారాల నిలుపుదలలో ప్రభుత్వానికి, పోలీసులకు  సంబంధం లేదని వివరించారు.సాక్షి తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ ఏపీలో సాక్షి ప్రసారాలు పునరుద్ధరించారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పై ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement