ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు.
ఎల్బీనగర్: పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా హయత్నగర్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగురోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు.