* ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ
* జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు
* పార్టీలకు అతీతం... పోలింగ్లో బ్యాలెట్
* అంతా మిలటరీ అధికారుల కనుసన్నల్లోనే...
కంటోన్మెంట్: ఎట్టకేలకు కంటోన్మెంట్ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది జనవరి 11న బోర్డు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన సుమారు 2.30 లక్షల మంది ఓటర్లు... ఎనిమిది మంది సభ్యులను బోర్డుకు ఎన్నుకుంటారు. పార్టీలకు అతీతంగా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక ఓటరు జాబితాను వినియోగించనున్నారు.
కొత్త చట్టం వచ్చాక రెండోసారి...
కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006’ అమల్లోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించడం ఇది రెండోసారి. ఈ చట్టం ప్రకారం తొలిసారి 2008 మే 18లో జరిగిన ఎన్నికల ద్వారా సికింద్రాబాద్లో తొలి పాలకమండలి
ఏర్పాటైంది. 2013 జూన్ 5తో ఈ పాలకమండలి గడువు పూర్తయినప్పటికీ, రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది జూన్ 5తో తొలి పాలక మండలి గడువు ముగిసింది. అప్పటి నుంచి మిలటరీ అధికారి అయిన బోర్డు అధ్యక్షుడు, మెంబర్ సెక్రటరీగా వ్యవహరించే సీఈఓల ఆధ్వర్యంలోని ప్రత్యేక బోర్డు ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతోంది.
ఇదీ బోర్డు స్వరూపం
దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులలో ఒక్కటి మినహా 61 చోట్ల ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులతో కూడిన బోర్డు కొలువుదీరుతుంది. జనాభా పరంగా నాలుగు కేటగిరీలుగా వీటిని విభజించారు. వీటిలో అత్యధిక జనాభాతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతి పెద్దదిగా కొనసాగుతోంది. మొత్తం 16 మంది సభ్యులు ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్కు స్థానిక మిలటరీ స్థావరం కమాండర్ (జీఓసీ-ఇన్-సీ) లేదా, అతని ద్వారా నియమితులైన బ్రిగేడియర్ ర్యాంకు అధికారి అధ్యక్షుడిగా ఉంటారు. బోర్డు సీఈఓగా పనిచేసే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్కు చెందిన అధికారి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఇద్దరు మిలటరీ అధికారులు హెల్త్ ఆఫీసర్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ ఆఫీసర్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గారిసన్ ఇంజనీర్)లతో పాటు మరో ముగ్గురు మిలటరీ అధికారులను అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. వీరితో పాటు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, లేదా అడిషనల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి (డీఆర్ఓ)ని బోర్డు సభ్యుడిగా నామినేట్ చేస్తారు. అంటే మొత్తం 16 మందిలో 8 మంది ప్రజల చేత ఎన్నికైన సభ్యులు కాగా, ఆరుగురు మిలటరీ అధికారులు, ఒక ఐడీఈఎస్ అధికారి (సీఈఓ), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి (మెజిస్ట్రేట్) సభ్యులుగా ఉంటారు.
ప్రత్యేక ఓటరు జాబితా
సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే ఓటరు జాబితానే వినియోగిస్తారు. కంటోన్మెంట్లలో జరిగే ఎన్నికలకు మాత్రమే ప్రత్యేకంగా జాబితాను రూపొందిస్తారు. కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ -2007 ప్రకారం ఈ జాబితాను తయారు చేస్తారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ఎన్నికల సంఘం రూపొందించిన జాబితా ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొంటుండగా.. ప్రత్యేకమైన జాబితాలో పేరు నమోదు చేసుకుంటేనే బోర్డు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు.
ముహూర్తం ఖరారు
Published Fri, Nov 7 2014 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement