హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రక్షణకు మెట్రో కారిడార్ వెంబడి 5 ‘ఏ- కేటగిరీ’, 12 ‘బీ- కేటగిరీ’ పోలీస్స్టేషన్లతో సహా 48 పోలీసు......
⇒ మరో 48 ఔట్ పోస్టుల ఏర్పాటు
⇒ మెట్రో రైలు భద్రతపై సమీక్షలో డీజీపీకి ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రక్షణకు మెట్రో కారిడార్ వెంబడి 5 ‘ఏ- కేటగిరీ’, 12 ‘బీ- కేటగిరీ’ పోలీస్స్టేషన్లతో సహా 48 పోలీసు ఔట్ పోస్టులను నిర్మించాలని ప్రతిపాదనలు అందాయి. మెట్రో భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో రైల్వేలు, రోడ్డు భద్రత విభాగం అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు.
మెట్రో ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఓ నివేదికను అందజేశారు. మెట్రో భద్రతకు సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎంవీఎస్ రెడ్డి, నగర సీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీలు అంజనికుమార్, సందీప్ శాండిల్య, సైబరాబాద్, రాచకొండ సీపీలు మహేశ్ భగవత్, నవీన్ చంద్, ఇంటెలిజెన్స్ ఐజీ శివానంద్ నింబర్గ్ తదితరులు పాల్గొన్నారు.