మళ్లీ భూముల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్ | land auction in hyderabad by government | Sakshi
Sakshi News home page

మళ్లీ భూముల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్

May 31 2016 9:21 AM | Updated on Sep 4 2017 1:21 AM

మళ్లీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

హైదరాబాద్ : మళ్లీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో 62 ప్రాంతాల్లోని భూముల వేలానికి తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సదరు భూములను ఇటీవల వేలం వేశారు. అయితే స్పందన కనిపించలేదు.

ఈ నేపథ్యంలో ఖానామెట్, రాజేంద్రనగర్, మణికొండ, నార్సింగి,పుప్పాలగూడ, నిజాంపేట ప్రాంతాల్లో భూములు వేలం వేయనున్నారు గజానికి అత్యల్పంగా రూ. 7 వేలు, అత్యధికంగా రూ. 45 వేల ఆప్ సెట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 22వ తేదీన ఈ ఆక్షన్ ద్వారా సదరు ప్రాంతాల్లోని భూములను విక్రయించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement