హైదరాబాద్ నగరంలో ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..18 నెలల్లో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదని చెప్పారు.
శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. గత పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించారని కేటీఆర్ విమర్శించారు.