గణేశ్ ఉత్సవాలపై నాయిని ఆధ్వర్యంలో ఈ నెల 29న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన అధికారులందరూ హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం అంతర్గత మెమో జారీ చేసింది. గత ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు, అసంతృప్తి కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు సమావేశానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను సైతం ముందుగానే సభ్యులకు అందజేయడం గమనార్హం.