‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు

Published Wed, Aug 30 2017 4:49 AM

‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు - Sakshi

జైపాల్‌రెడ్డి, డీకే అరుణలపై శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ నేతలే అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మండిప డ్డారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ ఈ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ, అధికారం కోల్పోగానే వారికి పాలమూరు జిల్లా ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రాయలసీమకు అక్రమంగా నీళ్లు తరలిం చుకుపోతుంటే జైపాల్‌రెడ్డి, డీకే అరుణ అధికారంలో ఉండగా ఏంచేశారన్నారు.

Advertisement
Advertisement