‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు | Congress leaders do not interfere with Palamuru-Ranga Reddy project | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు

Aug 30 2017 4:49 AM | Updated on Mar 22 2019 2:57 PM

‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు - Sakshi

‘పాలమూరు’కు కాంగ్రెస్‌ నేతలే అడ్డు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ నేతలే అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మండిప డ్డారు.

జైపాల్‌రెడ్డి, డీకే అరుణలపై శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ నేతలే అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మండిప డ్డారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ ఈ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ, అధికారం కోల్పోగానే వారికి పాలమూరు జిల్లా ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రాయలసీమకు అక్రమంగా నీళ్లు తరలిం చుకుపోతుంటే జైపాల్‌రెడ్డి, డీకే అరుణ అధికారంలో ఉండగా ఏంచేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement