ప్రారంభమైన కాంగ్రెస్ సదస్సు | congress Conference in nagarjuna sagar | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కాంగ్రెస్ సదస్సు

Nov 5 2015 12:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

మాజీ ప్రధాని నెహ్రో జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది.

నల్లగొండ: మాజీ ప్రధాని నెహ్రో జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది. నెహ్రో యువకుడిగా ఉన్నప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని చేసిన ప్రసంగాలు, ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టాలను ఈ సదస్సులో నెమరువేసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ప్రముఖులు ప్రసంగించనున్నారు.

అదేవిధంగా వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అతిధులు హాజరుకానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement